Friday, May 3, 2024

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని వర్ష ప్రభావిత ప్రాంతంలో రెండో రోజు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల శాంతి నగర్ చౌరస్తాలో రోడ్ పై నిలిచిన వర్షపు నీటిని పరిశీలించారు. డ్రైనేజీలో ఎప్పటికప్పుడు పూడిక తీయాలని, రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ సిబ్బందిని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్లాలని మంత్రి అధికారులకు సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సాయం కావాలన్నా ప్రభుత్వం అందుబాటులో ఉంటుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement