Saturday, May 4, 2024

తుంగభద్ర జలశయంకు కొనసాగుతున్న వరద

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా తుంగభద్ర జలాశయంకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. ఆదివారం ఉదయం జలాశయంకు 88270 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఇక జలాశయం నుంచి 221 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది. ఇక డ్యామ్ నీటిమట్టం 1633 అడుగుల కాను, ప్రస్తుతం 1626.22 అడుగుల నీటి నిల్వలు ఉన్నాయి. జలాశయంలో 105 టీఎంసీలకు కాను, 80.549 టిఎంసిల నీటి విలువలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement