Thursday, May 2, 2024

ADB: కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ గా నాతరి స్వామి

బెల్లంపల్లి, నవంబర్ 22 (ప్రభ న్యూస్) : తెలంగాణలో ప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ గా బెల్లంపల్లి నియోజకవర్గ నాయకుడు నాతరి స్వామిని నియమిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉత్తరులు జారీ చేశారు.

ఈ సందర్భంగా నాతరి స్వామి మాట్లాడుతూ… తనకు ఈ పదవి రావడానికి కృషిచేసిన పెద్దపెల్లి పార్లమెంట్ ఇన్చార్జి మోహన్ జోషి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షుడు గడ్డం వినోద్ వెంకట్ స్వామిలకు కృతజ్ఞతలు తెలిపారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement