Saturday, May 4, 2024

ADB: మార్నింగ్ వాక్ లో ప్ర‌జా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, జనవరి 12 (ప్రభన్యూస్): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని పాత ఉట్నూర్ పర్దాన్ కాలనీలో శుక్రవారం ఉదయం ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బోజ్జు పటేల్ మార్నింగ్ వాక్ చేస్తూ కాలి నడకన కాలినీలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గన్‌మెన్లు లేకుండా సాదాసీదాగా ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కాలనీలో కాలినడకన తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆ కాలనీలో ఇంటిపై విద్యుత్ తీగలు అనుకోని దగ్గరగా ఉండడంతో వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారానికి విద్య, వైద్య, వ్యవసాయం అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో నేలకొన్నా సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృప చేస్తాన ని హామీ ఇచ్చారు. ఆయన వెంట ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement