Saturday, April 27, 2024

NASIN Academy – 16న ప్రధాని మోడీ పాలసముద్రం రాక

శ్రీ సత్య సాయి బ్యూరో జనవరి 12 (ప్రభన్యూస్): భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 16వ తేదీన పెనుకొండ నియోజకవర్గం పాలసముద్రంకు విచ్చేయనున్నారు. పాలసముద్రం వద్ద జాతీయ రహదారికి ఆనుకుని, నాసిన్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసింది. ఇందులో జాతీయ స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇస్తారు. శిక్షణా కేంద్రం ప్రారంభోత్సవం ఈనెల 16న నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ పాలసముద్రం పర్యటన ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ముందస్తుగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి లు శుక్రవారం నాసిన్ అకాడమీని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement