Sunday, April 28, 2024

మద్యం బాటిల్స్‌ స్వాధీనం..

తాండూరు : బెల్లంపల్లి నుండి మహారాష్ట్రకు అక్రమంగా స్కార్పియో వాహనంలో తరలిస్తున్న మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తాండూరు ఎస్సై శేఖర్‌ రెడ్డి తెలిపారు. ఐబి కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా స్కార్పియో వాహనంలో మహారాష్ట్రకు రూ.95వేల విలువ గల మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. స్కార్పియోను, మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకొని, మద్యాన్ని తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement