Saturday, May 4, 2024

ట్రస్ట్‌ ఆధ్వర్యంలో హైపోక్లొరైడ్‌ పిచికారి..

కాసిపేట : మండలం ధర్మారావుపేట గ్రామంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోడియం హైపొక్లొరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. ఈ సంధర్భంగా నాయకులు మాట్లాడుతూ కరోనా రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రజలు ఎవరు ఇళ్ల నుండి బైటకు రావొద్దని.. తప్పనిసరి అనుకుంటే మాస్క్‌లు ధరించాలని, దూర ప్రయాణాలు చేయరాదని, ఏమాత్రం అనారోగ్యం అనిపించిన వెంటనే వైద్యులను కలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుటు సిద్దం తిరుపతి, ఎంపిటిసి పార్వతి మల్లేష్‌, నాయకులు రాజమౌలి,రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement