Sunday, May 5, 2024

ADB: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఖానాపూర్ ఎమ్మెల్యే…

ఉట్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: నాగపూర్ భారీ బహిరంగ సభకు ఖానాపూర్ నియోజవర్గం ఉట్నూర్ నుండి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున గురువారం తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ పెద్దల ఆదేశాలను పాటిస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ఖానాపూర్ ఎమ్మెల్యే సామాన్య కార్యకర్తగా ఆర్టీసీ బస్సులో నాగ్ పూర్ సభకు బయలుదేరారు.

ఇలా చేయడం పట్ల కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాయకుడంటే ఇలా ఉండాలని అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. సభకు తరలి వెళ్ళిన వారిలో ఎమ్మెల్యే తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య, లాజర్, ఉటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖయ్యూం, మాజీ అధ్యక్షులు దూటరాజేశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్బాల్, కాంగ్రెస్ నాయకులు నిసార్, సలీం, లాజర్, అచ్చ దేవానంద్, కార్యకర్తలు తరలి వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement