Monday, April 29, 2024

TS : రోడ్డు ప్రమాదంలో జూనియర్ అసిస్టెంట్ మృతి

తాంసి, మార్చి 16 (ప్రభ న్యూస్) : రోడ్డు ప్రమాదంలో జూనియర్​ అసిస్టెంట్​ మృతి చెందారు. తాంసి మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన మలపతి స్వామి ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం తాంసి మండల తహసీల్దార్ కార్యలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

అయితే శుక్రవారం రాత్రి పొలం పనులను ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో కంటైనర్ ఢీకొట్టింది. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు రిమ్స్​ తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్​లోని ప్రైవేటు ఆసుప్రతికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. స్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement