Monday, April 29, 2024

ఆదిలాబాద్‌లో జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆదిలాబాద్‌జిల్లాకు తెలంగాణ ప్రభుత్వం జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలను మంజూరు చేసింది. ఏర్పాటుకు అనుమతులిస్తూ ఈమేరకు మంగళవారం నాడు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆదిలాబాద్‌లో జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కాలేజీలో కోర్సులు, పనిచేసే సిబ్బంది, అవసరమైన బడ్జెట్‌కు సంబంధించిన వివరాలను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు.

జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటారని ఆమె ఉత్తర్వుల్లో తెలిపాిరు. ఖమ్మం జిల్లా పాలేరు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement