Tuesday, April 30, 2024

ఇంటింటి ప్రచారం..

మంచిర్యాల : నాగార్జున సాగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారంలో జిల్లా నేతలు తమకు కేటాయించిన మండలాల్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న జానారెడ్డికి మద్దతుగా మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు తమ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ రవికుమార్‌కు మద్దతుగా హాలియా మున్సిపాలిటీలోని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, మాజీ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహులు కుమారుడు భరత్‌కు మద్దతుగా గత నెల రోజుల నుండి ప్రభుత్వవిప్‌, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కుమారుడు విజిత్‌రావులు తమ ద్వితీయ శ్రేణి నాయకగణంతో విస్తృతశ్రేణి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement