Saturday, April 27, 2024

BASARA: నిజాయితీ చాటుకున్న ఆలయ హోంగార్డులు

బాసర, జనవరి 6 (ప్రభ న్యూస్) బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఆలయంలో శనివారం హోమ్ గార్డులు తమకు దొరికిన బంగారు ఉంగరాన్ని భక్తులకు అందజేసి తమ నిజాయితీని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా నిప్పెటపాడు గ్రామానికి చెందిన సురేష్ బాబు దంపతులు తమ కూతురుకు ఆలయ వెయ్యి రూపాయల అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాసం చేయించారు.

కూతురు మండపంలో బంగారు ఉంగరం పోగొట్టుకుంది. విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డులు దిగంబర్, శోభ, వెన్నెలకు బంగారు ఉంగరం దొరకడంతో ఆలయ మైకులు అనౌన్స్ మెంట్ చేయించి భక్తుడు సురేష్ బాబుకు ఆలయ ఇంఛార్జ్ ఇన్స్ స్పెక్ట‌ర్ గంగాధర్ సమక్షంలో అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆలయ హోంగార్లను భక్తులు ఆలయ అధికారులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement