Tuesday, April 30, 2024

ADB :బల్క‌ సుమన్‌కు ఓటు వేస్తామని గౌడ్‌ల‌ ఏకగ్రీవ తీర్మాణం

చెన్నూర్, అక్టోబర్ 30(ప్రభ న్యూస్) చెన్నూరు నియోజకవర్గ బిఆర్ యస్ అభ్యర్థి బాల్క సుమన్ కు తామంతా ఏక పక్షంగా ఓట్లు వేస్తామని చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ గీతా కార్మికులు గౌడ కులస్తులు తీర్మానించుకుని తీర్మాన పత్రాన్ని అభ్యర్థి బాల్క సుమన్ కు అందజేశారు.

ఎన్నికల ప్రచారంలో బాగంగా సోమవారం గ్రామానికి వెళ్లిన సుమన్ గౌడకులస్తులు తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ తనపై నమ్మకంతో గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాన్ని వమ్ము చేయకుండా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement