Saturday, April 27, 2024

ఫిష్‌ పాండ్‌ పనుల పరిశీలన..

భీమిని : మండల కేంద్రంలోని మహదేవ్‌ తలాబ్‌ చెరువులో నిర్మిస్తున్న ఫిష్‌ పాండ్‌ పనులను డీఆర్‌డీఏ పీడీ శేషాద్రి సిబ్బందితో కలిసి పరిశీలించారు. పనులను వేగవంతం చేసి సకాలంలో పనులు పూర్తి అయ్యేలా చూడాలని ఈజీఎస్‌ కూలీలకు సూచించారు. అనంతరం మండల పరిషత్‌ కార్యాలయంలో సిబ్బందితో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈజీఎస్‌ పనులు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ముఖ్యంగా హరితహారం నర్సరీలను సక్రమంగా పెంచాలని సిబ్బందికి సూచించారు. పీడీ వెంట ఏపిఓ భాస్కర్‌రావు, ఈజీఎస్‌ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement