Sunday, May 5, 2024

కేసిఆర్ ఆరోగ్యం కోసం భ‌ద్రకాళి అమ్మవారి ఆల‌యంలో మంత్రి స‌త్య‌వ‌తి పూజ‌లు..

వరంగల్ – కరోనా వైరస్ బారిన పడ్డ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరగా వైరస్ బారి నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, ఈ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటూ రాష్ట్ర గిరిజన, స్త్రీ – సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నేడు వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాలను పునరుద్ధరించి, పురోహితులకు 010 పద్దు కింద వేతనాలు ఇస్తూ.. ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించి, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. దాదాపు 1200 కోట్ల రూపాయలతో యాదాద్రిని పునర్నిర్మించి గొప్ప ఆలయంగా తీర్చుదిద్దుతున్నారు అని, ఇలాంటి గొప్ప నేత సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కొనసాగాలని భద్రకాళీ అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాబోయే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలకు మేలు చేసే తెలంగాణ ఇంటి పార్టీ గా ఉన్నా టిఆర్ఎస్ సంపూర్ణ విజయం సాధించాలని కోరుకున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement