Thursday, May 2, 2024

కార్మిక హక్కులు తాకట్టుపెడుతున్న టీబీజీకెఎస్..

‌బెల్లంపల్లి : కార్మిక హక్కులను తాకట్టు పెడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులను తెలంగాణ రాష్ట్ర హిందూ మజ్దూర్‌ సభ అధ్యక్షుడు రియాజ్‌ అహ్మద్‌ అన్నారు. ఇతర ఏరియా సిహెచ్‌పీలో షిప్టులో రేకు లోడింగ్‌ చేస్తే కార్మికులకు 2 గంటల ఓటీ కల్పిస్తుందని, గోలేటి ఓసీలో రేకు లోడింగ్‌ చేసే కార్మికులకు 2 గంటల ఓటీ కల్పించాలని యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. ఉచిత మాస్టర్‌కు ఆశపడి టీబీజీకెఎస్‌ నాయకులు కార్మికులకు ఆర్థికంగా నష్టం కల్గుతున్నా గుడ్డి వారిలో ప్రవర్తిస్తున్నారని, పదవి విరమణ చేసిన కార్మికుల స్థానంలో కార్మికులను నియమించి కార్మికులకు ఒక పని అలాట్‌ చేసి ఇంకో పని చేప్తున్నారని, ఇలా కార్మికులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్‌ నాయకులు ఎం.డి.వాజియార్‌, బోగె రవీందర్‌, ఖాధర్‌, రాజబాబు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement