Friday, May 3, 2024

కార్మికులకు ప్రోత్సాహక బహుమతులు..

కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేటగని 2వ గని కార్మికులకు ఏరియా జియం చింతల శ్రీనివాస్‌ ప్రోత్సాహక బహుమతులను అందచేశారు. గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గనిన జియం, ఉత్తమ సింగరేనియన్‌గా కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో బహుమతిని అందుకున్న బోగ రాంచందర్‌ కార్మికుడు, ఇతర కేటగిరిలలో పని నైపుణ్యం కనబరుస్తూ మెరుగైన ఉత్పత్తికి కృషి చేస్తున్న కార్మికులను ప్రోత్సహించేందుకు బహుమతులను అందించాడు.ఈ కార్యక్రమంలో ఏజెంట్‌ రాజేందర్‌, మెనేజర్‌ రవీందర్‌, ఏఐటీయూసి ఏరియా నాయకుడు సత్యనారాయణ, దాగం మల్లేష్‌, టిబిజికెఎస్‌ నాయకుడు కారుకూరి తిరుపతి ఏరియా,గని అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement