Monday, May 6, 2024

త్రాగునీటి సమస్య..

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్‌ మున్సిపాలిటీలోని 16వ వార్డులో చైర్మన్‌ పర్యటించి హిమాయత్‌ నగర్‌, గాంధీనగర్‌ ప్రజలకు ఏయే సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. ప్రజలకు త్రాగునీటి సమస్య అధికంగా ఉందని వారు వివరించారు. చేతిపంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలించి వాటికి మరమ్మత్తులు చేయించి అందులో నీరు ఉన్నచో మోటార్లు బిగించి సంబంధిత సిబ్బందికి తెలియజేశారు. ఆయన వెంట కౌన్సిలర్‌ తెనుగు లావణ్య దేవేందర్‌, కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement