Wednesday, April 24, 2024

గోదావరిలో మునిగి ఆరుగురు దుర్మ‌ర‌ణం….

నిజామాబాద్‌: పోచంపాడు గోదావ‌రిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో పడి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు మృతి దేహాలను గుర్తించారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. మెండోరా మండలం పోచంపాడు ప్రాజెక్టు దిగువ‌న‌.. గోదావ‌రిలో పుణ్య‌స్నానాల కోసం వ‌చ్చిన ఏడుగురు వ్య‌క్తులు న‌దిలో గ‌ల్లంతు అయ్యారు. వీరిలో ఒక‌రు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.., మిగ‌తా ఆరుగురు గ‌ల్లంతు అయ్యారు.. విష‌యం తెలుసుకున్న పోలీసులు జాల‌ర్ల సాయంతో గోదావ‌రిలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు… ఇప్ప‌టి వ‌ర‌కు రెండు మృత‌దేహాల‌ను గోదావ‌రి నుంచి వెలికి తీశారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారు. బాధితుల స్వ‌స్థ‌లం ఎల్ల‌మ్మ‌గుట్ట‌, డీకంప‌ల్లి, గుత్పా గ్రామాలు..గ‌ల్లంతైన వారిలో జిల‌క‌ర్ర సురేశ్‌(40), జిల‌క‌ర్ర యోగేష్‌(16), బొబ్బిలి శ్రీనివాస్ (40), బొబ్బిలి సిద్ధార్థ్‌(16), బొబ్బిలి శ్రీక‌ర్(14), దొడ్లె రాజు(24)లు ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.. ఈ ప్ర‌మాదంలో ద‌ర్ప‌ల్లి ర‌వికాంత్(15) సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాడు.. పోలీసులు గజ ఈతగాళ్లతో మిగతా నలుగురి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement