Tuesday, May 7, 2024

ADB: గెలిచిన నెలలోనే 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు… ఎమ్మెల్యే అనిల్ జాదవ్

బోథ్, జనవరి 7(ప్రభ న్యూస్): ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే గా గెలిచిన మొదటి నెల రోజులలో 30 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశామని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం నేరడిగొండ మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామానికి నూతన బిటి రోడ్డు నిర్మాణం కోసం 88 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణానికి భూమిపూజ చేశారు.

అనంతరం చేసిన ఎమ్మెల్యే అనిల్ మాట్లాడారు. బోథ్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్డు రవాణా విద్య, వైద్యం అందించడానికి ఎల్లవేళల కృషి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,అధికారులు, నాయకులు, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement