Sunday, May 5, 2024

ADB: వాడవాడలో రాముని అక్షింతల పంపిణీ

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: పండగ‌ వాతావరణంలో అయోధ్య రాముని అక్షింతల పంపిణీ కొనసాగుతుంది. ఈ నెల 22న అయోధ్య రాముని మందిరం లో రాముని విగ్రహ ప్రతిష్టపాన కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రాముని అక్షింతల పంపిణీ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని వాడ వాడలో అక్షింతలు తీసుకువెళ్ళడానికి మహిళలు భక్తి శ్రద్ధలతో మంగళ హారతులతో ఊరేగింపు గా సాగుతుంది.

స్థానిక జగనాధాలయంలో అక్షింతలు ప్రధాన అర్చకులు మోహనా చారి ప్రత్యేక పూజల అనంతరం అక్షింతలు పంపిణీ చేశారు. యజ్ఞంలా సాగుతున్న అక్షింతల కార్యక్రమంతో పట్టణంలో పండుగ వాతావరణం చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement