Sunday, April 28, 2024

Komuravelli: క‌న్నుల పండుగగా కోర మీసాల సామి ల‌గ్గం… ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన మంత్రులు పొన్నం, కొండా

సిద్దిపేట ప్రతినిధి/చేర్యాల/కొమురవెళ్లి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం,కొలిచిన భక్తుల కొంగు బంగారం శ్రీకొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం మహోత్సవం కన్నుల పండుగగా, కమనీయంగా ఆగమశాస్త్ర ప్రకారం గొల్ల కేతలమ్మ,బలిజ మేడలమ్మ తో జరిగింది.శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం ఉత్సవంలో ఉజ్జయిని పీఠాధిపతులు శ్రీ 1008 జగద్గురు సిదలింగరాజదేశి కేంద్ర శివాచార్య మహా స్వామీజీ పాల్గొన్నారు.

పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మంత్రులు….కొండ సురేఖ,పొన్నం ప్రభాకర్,ఎమ్మెల్యే పల్లా…
శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వేర్ రెడ్డిలు లు ముత్యాల తలంబ్రాలు,పట్టు వస్త్రాలు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement