Thursday, May 9, 2024

సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్య‌మైంది : ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

ముధోల్ మండలంలోని విట్టొలి తండాలో సుమారు 20 లక్షల రూపాయిలతో నూతన గ్రామ పంచాయ‌తీ భవన పనులను ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ వచ్చిన తరువాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందింది అని, తండాలను గ్రామ పంచాయ‌తీలుగా మర్చిన ఘనత మన సీఎం కేసీఆర్ దే అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పల్లెలు చాలా అభివృద్ధి చెందాయి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, మండల రైతు బంధు అధ్యక్షులు రామ్ రెడ్డి, స్థానిక సర్పంచ్ జే.విజేష్, ఉప సర్పంచ్ కౌసల్య బాయి, వార్డు మెంబర్ లు రాథోడ్ పండు, రాథోడ్ అమృత, జాదవ్ సంపత్, రాథోడ్ గజనంద్, సీహెచ్ లచ్చిరామ్, మండల సర్పంచ్ లు ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement