Tuesday, May 7, 2024

సామూహిక హరితహారం.. మొక్క నాటిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను దేశంలోనే ఇంత ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇవాళ ఒక్కరోజే 75 లక్షల మొక్కలు నాటుతున్నామని చెప్పారు. హైదరాబాద్‌ బొటానికల్‌ గార్డెన్‌లో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement