Friday, May 3, 2024

9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్

మంచిర్యాల, జూన్ 7 (ప్రభ న్యూస్) : ఈనెల 9న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించ‌నున్నారు. ఈ సందర్భంగా నిర్వహించబోయే బహిరంగ సభ వేదిక పనులను బుధవారం ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ .. బహిరంగ సభకు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు
ఈ నెల 9వ తేదీన సీసీసీ నస్పూర్ లో నూతన కలెక్టరేట్ భవన ప్రారంభోత్సవం, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం మంచిర్యాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకూడదనే ఉద్దేశ్యంతో 9న ఉదయం నుండి ట్రాఫిక్ మళ్ళింపు చేపట్టడం జరిగిందని పోలీస్ అధికారులు వెల్లడించారు.
గోదావరిఖని, చెన్నూరు వైపు నుండి మంచిర్యాల వైపు వచ్చే వాహనదారులు శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ వద్ద ఉన్న నేషనల్ హైవే ఫ్లైఓవర్ మీదుగా క్యాతనపల్లి గాంధారి వనం నుండి మంచిర్యాల వైపు వెళ్లాలని, మంచిర్యాల వైపు నుండి శ్రీరాంపూర్, చెన్నూరు, గోదావరిఖని వైపు వెళ్లే వాహనదారులు మంచిర్యాల ఐబి చౌరస్తా నుండి క్యాతనపల్లి గాంధారి వనం వద్ద గల నేషనల్ హైవే ఫ్లైఓవర్ మీదుగా శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ వద్ద నుండి వెళ్లాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement