Sunday, April 28, 2024

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి : బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ రూరల్, జూన్ 7 (ప్రభ న్యూస్) : రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త సైనికుడిల పనిచేసి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఆయన నివాస గృహంలో ఏర్పాటు చేసిన నిర్మల్ రూరల్ బీజేపీ మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆగడాలను ప్రజాక్షేత్రంలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు చేరువ‌య్యేందుకు ప్రయత్నించాలని సూచించారు. స్థానికంగా జరుగుతున్న అవినీతి అక్రమాలను ఎక్కడికి అక్కడ ఎండగట్టాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేయాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో బీజేపీ నేతలు అయ్యన్న గారి భూమయ్య, రావుల రామనాథ్, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, సామ రాజేశ్వర్ రెడ్డి అలివేలు మంగ, నారాయణరెడ్డి, శ్రావణ్ రెడ్డి, చందు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement