Tuesday, April 30, 2024

ADB: చెన్నూర్ లో సీఎం దిష్టి బొమ్మ దగ్దం

చెన్నూర్, ప్ర‌భ‌న్యూస్‌: మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఎఫ్ఐఆర్ నమోదును నిరసిస్తూ చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ నాయకులు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్దం చేశారు.

తొలుత పార్టీ ఆఫీస్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన నాయకులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ తెలుగు తల్లి విగ్రహ వద్ద సీఎం దిష్టి బొమ్మను దగ్దం చేశారు. నిరసన కార్యక్రమాన్ని పోలీసు భగ్నం చేసే ప్రయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement