Wednesday, May 22, 2024

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్

బెల్లంపల్లి : బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 22వ వార్డులో రూ.4.30లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్‌ గడ్డం అశోక్‌గౌడ్‌ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, మున్సిపల్‌ కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌ల సహకారంతో ఈ రోడ్డు పనులను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు శ్రీధర్‌, నెల్లి రమేష్‌, ఎస్‌.కె.షకీల్‌, జంజర్ల మురళి, జాగేటి రాజలింగు, పి.రామస్వామి, ఆడేటి శ్రీనివాస్‌, గౌరక్క, మల్లక్క తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement