Thursday, May 16, 2024

నిజామాబాద్ డీసీ కారు బోల్తా

నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనతోపాటు కారు డ్రైవర్‌, మరో నలుగురు గాయపడ్డారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ మంద రవిబాబు.. నిజామాబాద్‌ నుంచి సాయిపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద ధాటికి కారు ముందు టైరు విరిగి దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో రవిబాబు, కారు డ్రైవర్‌ హర్బజ్‌ ఖాన్‌, మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement