Friday, April 26, 2024

సీసీ కెమెరాల ఏర్పాటు కోసం విరాళం..

బెల్లంపల్లి : కన్నెపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాలను ఎస్సై ప్రశాంత్‌ రెడ్డి సందర్శించి ప్రధాన చౌరస్తాలోని పలు కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించగా మాదవెల్లి గ్రామస్తులు ఎస్సై సూచన మేరకు స్వచ్చంధంగా ముందుకు వచ్చి రూ.27,500లను ఎస్సైప్రశాంత్‌ రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు వచ్చాక నేరాలు అదుపులోకి వచ్చాయని అన్నారు. పట్టణాలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా కన్నెపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో ప్రజలు అందరు ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement