Friday, April 19, 2024

పుంజుకున్న మార్కెట్లు..

ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మార్కెట్లు ప్రారంభమయిన కాసేపటికే నష్టాలను చవిచూసాయి. 49,441 వద్ద ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10.30 గంటల సమయానికి 200 పాయింట్లు లాభపడింది. ఇక, 14,737 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ ఉదయం 10.30 గంటల సమయానికి 77 పాయింట్లు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు దేశీయ సూచీలకు అండగా నిలుస్తున్నాయి. అలాగే ఈ వారం విడదల కానున్న ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఫలితాలపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement