Saturday, April 27, 2024

బెల్లంపల్లిలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

బెల్లంపల్లి ఏప్రిల్ 6 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలో గురువారం కాంట చౌరస్తా వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ ప్రభుత్వమే చేస్తుందని నమ్మిస్తూ, బండి సంజయ్ చేసిన లీకేజీ బయటకు రావడం జరిగిందని, బండి సంజయ్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్లు బీఆర్ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement