Tuesday, May 7, 2024

Boath : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే బాపూరావు

బోథ్, జూన్ 9 (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక పరిచయ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సంక్షేమ ఫలాల సంబరాలలో బోథ్‌ ఎమ్మెల్యే బాబురావు రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొని సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శం అని అన్నారు. రెండవ విడత గొర్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బాపురావు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మీ పథకం, షాదీ ముబారక్, చెక్కులు లబ్ధిదారులకు అందించారు. వెనుక బడ్డ బీసీ కుల వృత్తులకు అండగా నిలవాలని ఉదేశ్యంతో తెలంగాణ రాష్ట్రం ఇటీవల ప్రారంభించిన కుల వృత్తులకు రూ.1,00,000/- సహాయాన్ని లబ్ధిదారులకు అందజేస్తూ పథకాన్ని ప్రారంభించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నన్ని పథకాలు దేశంలో ఎక్కడ లేవని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రీజ, అధికారులు, పలు మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎంపిపిలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, ఎంపిటిసిలు, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement