Thursday, May 2, 2024

బిజెపి జోలికి వస్తే ఊరుకోబోం..

బెల్లంపల్లి : బెల్లంపల్లి జేఏసీ అని చెప్పుకునే వ్యక్తులు బిజెపికి సంబంధం లేని విషయంలో టీఆర్‌ఎస్‌, బిజెపి చీకటి ఒప్పంధం అని తమను అవాక్కులు, చెవాక్కులు పేల్చడాన్ని ఖండిస్తున్నామని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్‌ అన్నారు. బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో అందినకాడికి దోచుకొని అందడం ఆగిపోవడంతో గ్రంథాలయం గుర్తుకు వచ్చిందా అని అన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని బాలాజీ థియేటర్‌ ప్రక్కన ఉన్న భూమిలో పార్టీని దూషిస్తే సహించేది లేదని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్‌ భూమి బిజెపి పార్టీలోకి రాకముందేఉందని, పార్టీలో ఉన్న సమయంలో సత్య, అసత్యాలు తెలుసుకొని ఆరోపణలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రాచర్ల సంతోష్‌, సబ్బని రాజనర్సు, ఎరుకల శ్రీనివాస్‌, రేవెల్లి రాజలింగు, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement