Sunday, April 28, 2024

బస్తీలో డ్రైనేజీని శుభ్రపరచాలని కమిషనర్‌కు వినతి

బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్‌ బస్తీలో మురికి కాల్వలను వెంటనే శుభ్రపరచాలని ఆ వార్డు ప్రజలు మున్సిపల్‌ కమీషనర్‌ ఆకుల వెంకటేష్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. మురికి కాల్వల్లో పెద్దఎత్తున చెత్తాచెదారం పేరుకుపోయి వీధుల్లో మురికి నీరు ప్రవహిస్తుందని, దుర్గంధం వెదజల్లడంతో పాటు రోగాల బారీన పడుతున్నామని, వెంటనే మున్సిపల్‌ అధికారులు స్పందించి పారిశుద్ధ్య నిర్వాహణ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement