Monday, April 29, 2024

ఆత్మీయత ఫౌండేషన్‌ సేవలు ప్రశంసనీయం..

బెల్లంపల్లి : ఆత్మీయత ఫౌండేషన్‌ సేవలు ప్రశంసణీయమని బెల్లంపల్లి రూరల్‌ సీఐ జగదీష్‌ అన్నారు. ఆత్మీయత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాల గురిజాల గ్రామంలో రెండు వేరు వేరు చోట్ల ఏర్పాటు చేసిన చలివేంద్రాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎండాకాలంలో ప్రజల దప్పికను తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, నేటితరం యువతీ, యువకులు మంచి భావాలతో స్వచ్చంధ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ కార్యక్రమాలతో ఆత్మీయత ఫౌండేషన్‌ ప్రజల ఆదరాభిమానాలను చురగొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలగురిజాల సర్పంచ్‌ గోమాస అశోక్‌, మాజీ సర్పంచ్‌ తిరుపతి, ఆత్మీయ ఫౌండేషన్‌ అధ్యక్షుడు తిరుపతి, ప్రధాన కార్యదర్శి కోల వెంకటేష్‌, క్రీయాశీల సభ్యులు వికాస్‌ యాదవ్‌, రత్నం శ్రీనివాస్‌, మనోజ్‌, జూపాక శేఖర్‌, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement