Sunday, April 28, 2024

మేడే పోస్టర్ల ఆవిష్కరణ..

బెల్లంపల్లి : 135వ మేడేను ఘనంగా జరపాలని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి టి.శ్రీనివాస్‌ అన్నారు. బెల్లంపల్లి సివిల్‌ కార్యాలయ ఆవరణలో మేడే పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కార్మిక వర్గానికి వ్యతిరేకంగా సవరించడమే కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం, జాతి ప్రయోజనాల కోసం నెలకొల్పిన పరిశ్రమలను కార్పోరేట్‌ శక్తులకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఈ 135వ మేడే సందర్భంగా మంచి భవిష్యత్తు కోసం చరిత్రను మార్చే శక్తి కార్మిక వర్గం కల్గి ఉందని, మరోసారి విశ్వాసాన్ని ప్రకటించుకుందాని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసి జిల్లా నాయకులు ఎం.డి.చాంద్‌పాషా, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి చరణ్‌, నాయకులు కృష్ణవేణి, నారాయణ, భూమయ్య, వెంకటి, భానుప్రకాష్‌, కొమురయ్య, అమృత, కమల, లత, గణేష్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement