Monday, April 29, 2024

నైట్ కర్ఫ్యూ వేళ సూర్యాపేట జిల్లాలో రికార్డింగ్ డ్యాన్సులు

కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం దానిని కట్టడి చేసేందుకు ముందస్తు చర్యలో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. కానీ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలోని నక్కగూడెం, మఠంపల్లి మండలంలోని రఘునాథపాలెం, పాలకవీడు మండలంలోని జాన్ పహాడ్ గ్రామాలలో ఈ కర్ఫ్యూ వర్తించదని తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా ఆ గ్రామాలలో డ్రామాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రికార్డింగ్ డ్యాన్స్ టీమ్ లను తీసుకువచ్చి రికార్డింగ్ డ్యాన్సులను శనివారం రాత్రి నిర్వహించారు. నిర్వాహకులు రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పోగ్రామ్ లు నిర్వహించినట్లు సమాచారం. వీటిని చూసేందుకు ఒక్కొక్క స్టేజీ వద్దకు సుమారు 500 మందికి పైగా స్థానిక ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement