Monday, May 6, 2024

గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా..

నిర్మల్‌ : భైంసా బాలుర గురుకుల పాఠశాలలో మరో 25 మంది విద్యార్థులు కరోనా భారిన పడ్డారు. తాజాగా నిర్ధారణ అయిన పాజిటివ్‌ కేసులతో కలుపుకుని పాఠశాలలో మొత్తం కరోనా కేసులు 35కు చేరాయి. రెండు రోజుల్లో 90 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 35 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ పాఠశాలలో మొత్తం 180 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు సెంట్‌పాల్‌ స్కూల్‌లో ముగ్గురికి, గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయునికి కరోనా నిర్ధారణ అయింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement