Thursday, April 25, 2024

క‌రీంన‌గ‌ర్ అభిమానుల‌తో ష‌ర్మిల ఆత్మీయ స‌మావేశం..

కరీంనగర్: క‌రీంన‌గ‌ర్ తో వైఎస్ ఆర్ కి విడ‌దీయ‌రాని బంధం ఉంద‌ని అన్నారు వైఎస్ షర్మిల‌.. తెలంగాణాలో కొత్త పార్టీ ఏర్పాటులో భాగం ఆమె నేడు క‌రీంన‌గ‌ర్ జిల్లా అభిమానుల‌తో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరీంనగర్ రైతుల కష్టాలు చూసే ఉచిత విద్యుత్‌ ఇచ్చారని ఆమె గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లా రైస్‌బౌల్ అనడానికి వైఎస్సే కారణమని చెప్పారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు కట్టించిన ఘనత వైఎస్‌దన్నారు. శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చారని గుర్తుచేశారు. రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తానన్నారు. కరీంనగర్ కమాన్‌ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోందన్నారు. సిటీ ఆఫ్ ఎనర్జీ రామగుండం, సింగరేణి మనకు తలమానికం..అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన నేతన్నలు కనిపిస్తారని చెప్పారు. క‌రీంన‌గ‌ర్ కు తిరిగి పున‌ర్ వైభ‌వం తెస్తాన‌ని అన్నారు.. వ‌చ్చే నెల తొమ్మిదో తేదిన ఖ‌మ్మంలో జ‌రిగే పార్టీ అవిర్భావ స‌భ‌కు క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి వైఎస్ అభిమానులు భారీ సంఖ్య‌లో త‌ర‌లి రావాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement