Wednesday, May 8, 2024

ట్రిపుల్ ఐటిని ముట్ట‌డించిన ఆమ్ ఆద్మీ – ఉద్రిక్త‌త

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ – ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు శాంతియుతంగా కళాశాల అధికారులకు వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడం తో ఆందోళన వాతావరణం నెలకొంది.. కళాశాల ప్రధాన ద్వారం ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను దూకి గేటు ముట్టడికి యత్నించారు.. పోలీసులు అప్రమత్తమై అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సంద‌ర్భంగా ఆమ్ ఆద్మీ నేత‌లు మాట్లాడుతూ,..బాసర ఐఐఐటి కళాశాల ప్రాంగానమా..? లేక జైలా…? పోలీసులు ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించారు…బాసర ఐఐఐటి విద్యార్థుల సమస్య లు పరిష్కరించకపొతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లు చేస్తామని హెచ్చరించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement