Saturday, April 27, 2024

TS: ప్రేమ విఫలమైందని యువకుని బలవన్మరణం.. ఆసుపత్రిలో సూసైడ్ నోట్..

జున్ను ప్రతినిధి, మార్చి 27 (ప్రభ న్యూస్) : నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద శాస్త్రినగర్ లో గల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేసే లక్ష్మణ్ అనే 25ఏళ్ల యువకుడు ప్రేమ విఫలమై ఆసుపత్రిలో సూసైడ్ నోట్ రాసి గుర్తుతెలియని పదార్థం తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతుడు లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్. మూడు నెలల కాలం నుండి ఆస్పత్రిలో కాంపౌండర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇదే ఆసుపత్రిలో పనిచేస్తున్న యువతితో కొంతకాలం నుండి ప్రేమ వ్యవహారం నడుస్తుండగా ఆ యువతి ఈమధ్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సూసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చి ఆస్పత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడితే ఉదయం వరకు తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అని బంధువులు ఆసుపత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుడు మాట్లాడుతూ.. లక్ష్మణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం రాగానే ఆస్పత్రికి వచ్చే పరిశీలించామని, మృతుని పక్కన దొరికిన సూసైడ్ నోట్ ఆధారంగా ప్రేమ విఫలమైందనే డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. మృతుడి బంధువు మాట్లాడుతూ… లక్ష్మణ్ చనిపోయిన విషయం తమకు ఆలస్యంగా తెలిపారని, తాము రాకముందే ఎందుకు అక్కడి నుండి శవాన్ని తరలించారని, తమకు మృతి విషయంలో అనుమానాలు ఉన్నాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement