Monday, April 29, 2024

శంషాబాద్ లో అదృశ్య‌మైన విద్యార్థి క‌థ విషాదాంతం..

శంషాబాద్ లో అదృశ్య‌మైన విద్యార్థి క‌థ విషాదాంత‌మైంది. నెల క్రితం మిస్సింగ్ అయిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో శవమై చెరువులో కనిపించాడు‌. శంషాబాద్ కు నిఖిల్ కుమార్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. గత నెల కాలేజ్ కని చెప్పి వెళ్లిన నిఖిల్ ఇంటికి రాకపోవడంతో తెలిసిన ప్రదేశాలలో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ రోజు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చారీనగర్ కాలనీ శివారులోని చెరువులో నిఖిల్ మృతదేహం లభించింది. మృతదేహాన్ని వెలికితీసిన పొలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement