Sunday, May 5, 2024

TS | పురుగుల మందు తాగి విద్యార్థి ఆత్మహత్య.. మ‌హ‌బుబాబాద్ జిల్లాలో ఘ‌ట‌న‌

గూడూరు (ప్రభ న్యూస్) : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరంచ గిరిజన గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (సోమ‌వారం) జ‌రిగింది. హర్కావత్ రాజేష్ అనే విద్యార్థి పురుగుల మందు తాగి మృతి చెందాడు.

ఈనెల 14న‌ పాఠశాల నుండి తమ స్వగ్రామమైన ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఇన్‌చెర్వుప‌ల్లి గ్రామానికి ఉపాధ్యాయుల ప‌ర్మిష‌న్‌తో వారి అన్న తీసుకెళ్లాడు. ఇంటి నుంచి పాఠశాలకు వస్తున్న క్రమంలో వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పురుగుల మందు కొనుగోలు చేసి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహ‌నంలో ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ చ‌నిపోయాడు. అత‌ని మృతికి గల కారణాలు తెలియవలసి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement