Sunday, April 28, 2024

పిచ్చోని చేతిలో రాయి.. స్వార్థ రాజ‌కీయాల‌కు విద్యార్థులు బ‌లి.. కేటీఆర్

బిజెపి నేత‌ల‌పై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ విషయంపై మంత్రి కేటీఆర్ బుధవారం స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈ కేసులో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదమంటూ మంత్రి ట్వీట్ చేశారు. నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీజేపీ.. పేపర్ లీకేజీ కుట్రలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్.. అంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.

పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…
కానీ,అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…
తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీక్ చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు అని ట్వీట్ లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement