Saturday, April 27, 2024

వరంగల్ తూర్పులో ఉద్రిక్తత.. ఎర్రబెల్లి ప్రదీప్ రావు అరెస్ట్

వ‌రంగ‌ల్ తూర్పులో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొంది. తెలంగాణ బీజేపీ రథసారథి బండి సంజయ్, వరంగల్ అధ్యక్షులు కొండేటి శ్రీధర్, ఇతర బీజేపీ నాయకుల అక్రమ అరెస్ట్ కు నిరసనగా వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్ లో బీజేపీ నేత ఎర్ర‌బెల్లి ప్రదీప్ రావు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దికి ప్రదీప్ రావును అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో తూర్పు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్య‌క్తం చేశారు.

వరంగల్ : వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో అక్రమ అరెస్టులను నిరశిస్తూ బీజేపీ నేత‌లు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బిజెపి ఈస్ట్ నేత కుసుమ సతీస్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. ఇంతేజార్ గంజ్ పోలీసులు కుసుమ సతీష్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement