Friday, April 26, 2024

బండి అరెస్టు.. మోడీ, అమిత్ షా గరంగరం

న్యూఢిల్లీ.. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు కావడంపై ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి వివరాలు సేకరించారు. అంతకు ముందు జేపీ నడ్డా బండి సంజయ్ అరెస్టు వివరాలను డా.లక్ష్మణ్, కిషన్ రెడ్డిల ద్వారా అడిగి తెలుసుకున్నారు. టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారని, అయితే దీనిపై ఇంతవరకూ సరైన క్లారిటీ లేదని నడ్డాకు విన్నవించారు. అర్ధరాత్రి పూట బండి సంజయ్ ని వందలాది మంది పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేశారని తెలిపారు. ఈ అరెస్టు అప్రజాస్వామికమని కూడా నడ్డాకు చెప్పారు. వారు తెలిపిన వివరాలను నడ్డా యదాతథంగా మోడీకి, అమిత్ షాకు తెలిపారు. దీనిపై మోడీ, అమిత్ షాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement