Sunday, April 28, 2024

శ్రీ సాయి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం

తాండూర్ ఏప్రిల్ 5 (ప్రభ న్యూస్) : తాండూర్ శ్రీ సాయి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తాండూరులోని భక్త మార్కండేయ ఆలయం వద్ద బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి లైన్స్ క్లబ్ అధ్యక్షులు సురభి ఆగమరావు ఆలయ కమిటీ చైర్మన్ ఎలుక రాంచెందర్ లయన్స్ క్లబ్ సభ్యులు మద్దిబోయిన గోపాల్, బండి సత్యనారాయణ, పెర్క రాజన్న, గాజుల రమేష్, కైలాస్, బండి సంతోష్, దుర్గా చరణ్ , వసంత్ తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement