Friday, May 3, 2024

TS: గొంతు కోసి మ‌హిళ దారుణ హ‌త్య‌…

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి మండలం వన్‌పల్లి గ్రామంలో మల్లవ్వ (45)ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొంతుకోసి హత్య చేశారు. శుక్రవారం రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు.. మల్లవ్వ గొంతు కోసి అతికిరాతంగా చంపేశారు.

గొంతు కోయడంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. మల్లవ్వ చుట్టుపక్కల పెద్దగా ఇళ్లులు లేకపోవడంతో దుండగుల పని ఈజీ అయ్యింది. శనివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మల్లవ్వ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement