Tuesday, May 14, 2024

లోకేశ్వ‌రంలో కార్డ‌న్ సెర్చ్… 84 వాహ‌నాలు సీజ్

నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ , భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ లా ఆదేశానుసారం శనివారం లోకేశ్వరం మండలంలోని నగర్ గ్రామంలో కాటన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామాలలో జరిగే నేరాలను అదుపు చేయడం కోసమే కాటన్ సెర్చ్ లను నిర్వహిస్తున్నామని ముధోల్ సిఐ వినోద్ అన్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ పత్రాలు సరిగ్గా లేని77 మోటార్ వెహికల్ లను, 3 ఆటోలను , 4 కార్లను సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు.

అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరించినట్లయితే అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement